Sunday, April 28, 2024

AP | మూడు రాజధానుల పేరుతో నయవంచన : బాలకృష్ణ

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం నందికొట్కూరు పటేల్ సెంటర్‌లో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.

ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ చీకటి పాలన కావాలో… చంద్రబాబు అభివృద్ధి కావాలో జనం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రాయలసీమ అన్నదాత, జలదాత నందికొట్కూరు అని చెప్పారు. సొంత బాబాయిని హత్యచేసిన వారిని జగన్ కాపాడుతున్నారని మండిపడ్డారు. తల్లిని, చెల్లిని ఇంటి నుంచి జగన్ గెంటేశాడన్నారు. లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగుల పొట్టకొట్టారని విరుచుకుపడ్డారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement