Thursday, May 2, 2024

తెలంగాణ‌లో కూడా ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల్సిందే – సినీ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు వైవీఎస్ చౌద‌రి

ఏపీలో కొత్త‌గా ప‌లు జిల్లాలు ఏర్ప‌డ‌నున్నాయి. కాగా విజ‌య‌వాడ కేంద్రంగా ఓ జిల్లా ఏర్ప‌డ‌నుంది. ఈ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని తాను స్వాగ‌తిస్తున్నాన‌ని ద‌ర్శ‌కుడు, నిర్మాత వైవీఎస్ చౌద‌రి తెలిపారు. కాగా తెలంగాణ‌లో కూడా ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజల అభిమతం, అకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఇక . ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వలోని కేంద్ర ప్రభుత్వం… ఎన్టీఆర్‌ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరును ఏపీ సర్కార్‌ ఫైనల్‌ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement