Saturday, April 20, 2024

కొడాలి నానిపై చ‌ర్య‌లు తీసుకునే వ‌ర‌కు పోరాటం చేయాలి : చంద్ర‌బాబు

ఏపీ మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకునే వరకు క్యాసినో వ్యవహారంలో పోరాటం చేయాలని నేతలకు మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ప్రక్రియను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు తెలుగు దేశం పార్టీ నేతలు. అధికార వైసీపీ పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ప్రక్రియ కొనసాగుతుందని పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చారు. క్యాసినో వ్యవహారం, ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు నేతలు. పార్టీకి ఏపీ పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా టీడీపీ మాత్రం స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని నేతలకు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement