Friday, May 17, 2024

MDK : సిపిఎం నేతలతో ఎంపీ అభ్యర్థి నీలం మధు భేటీ

సంగారెడ్డి జిల్లా సిపిఎం నేతలతో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మంగళవారం ఉద‌యం భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డితో కలిసి సంగారెడ్డిలోని సిపిఎం పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్, కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యంలను మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

అనంతరం వారితో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇండియా కూటమిలో భాగంగా సిపిఎం మద్దతు కోరినట్లు నీలం మధు పేర్కొన్నారు. ప్రధానంగా బిజెపి ఓటమి లక్ష్యంగా సిపిఎం ముందుకు ముందుకెళుతుందని జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ తెలిపారు. జిల్లాలోని సిఐటియు, అనుబంధ సంఘాలన్నింటిని ఐక్యం చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపుకు పాటుపడతామని పేర్కొన్నారు. ఈ భేటీలో జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, నరసింహులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement