Saturday, April 27, 2024

TS | మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి.. శుభాకాంక్షలు తెలిపిన ఐఅండ్​పీఆర్​ కమిషనర్​, డైరెక్టర్

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమాచార పౌర సంబంధాలు & భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డికి సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కె అశోక్ రెడ్డి, డైరెక్టర్ బి. రాజమౌళి పుష్పగుచ్చం, మెమెంటో ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే మంత్రికి అదనపు సంచాలకులు కె నాగయ్య, సి ఐ ఈ రాధాకృష్ణ, జాయింట్ డైరెక్టర్ డి ఎస్ జగన్ , ఆర్ ఐ ఈ రాములు, ఉప సంచాలకులు మధుసూదన్, వెంకటేశ్వర్లు, రాజారెడ్డి, హష్మీ, ప్రసాదరావు , సురేష్ ,మీడియా అకాడమీ సెక్రెటరీ వేంకటేశ్వర రావు , ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement