Friday, May 3, 2024

AP: కారును ఢీకొన్న లారీ… ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్ డెడ్

కారును లారీ ఢీకొట్ట‌డంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్ లో మృతిచెందిన ఘ‌ట‌న‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కకడే మృతి చెందారు.

కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖ నుండి కారు తుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement