Sunday, May 26, 2024

మేగి తుఫాన్ – విరిగిప‌డిన కొండ చ‌రియ‌లు – 25మంది మృతి

భారీ వ‌ర‌ద‌లతో కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి..ఈ ఘ‌ట‌న‌లో 25మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న పిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది. మేగి తుఫాన్ బీభ‌త్సం సృష్టించింది. తూర్పు, ద‌క్షిణ తీరాల్లో చిక్కుకున్న ప్ర‌జ‌ల్ని ర‌క్షించేందుకు ఇంకా అక్క‌డ స‌హాయ చర్య‌లు కొన‌సాగుతున్నాయి. మేగి తుఫాన్ వ‌ల్ల సుమారు గంట‌కు 65 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పిలిప్పీన్స్‌లో ప్ర‌తి ఏడాది క‌నీసం 20 ఉష్ణ తుఫాన్లు వ‌స్తుంటాయి. తూర్పు తీరంపై మేగి తుఫాన్ విరుచుకుప‌డ‌డంతో సుమారు 13వేల మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లారు. భారీ వ‌ర్షాలు, గాలుల వ‌ల్ల విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఇండ్లు, పొలాల్లోకి నీరు ప్ర‌వేశించింది. గ్రామాల్లోకి మ‌ట్టి బ‌రుద కొట్టుకువ‌స్తోంది. ప్ర‌జ‌లు నానా ఇబ్బందికి గురి అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement