Saturday, May 4, 2024

వైద్యం కోసం ఆర్థిక సాయం…

ధరూర్: మండలంలోని మాల్ దొడ్డి గ్రామానికి చెందిన వీరేష్ ఇటీవల విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడటంతో తన రెండు చేతులను కోల్పోయారు. వైద్య చికిత్స కొరకు అప్పుచేసి 16లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ ఓ ప్రయివేటు హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. ఇంకా వైద్య చికిత్స కొరకు 8లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో చేసేదేమీలేక దాతల సహాయం కొరకు ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మల్దకల్ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి 20వేలు, సీడ్ ఆర్గనైజర్లు బ్రహ్మయ్య 10వేలు, బూరెడ్డి పల్లి ప్రతాప్ రెడ్డి 5వేలు రూపాయలను వీరేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. తమ కుటుంబానికి దాతలుగా ముందుకు వచ్చి పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందజేసినందుకు వీరేష్ కుటుంబ సభ్యులు , గ్రామస్తులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement