Thursday, May 16, 2024

సామాన్యుడిపై విద్యుత్ భారం: సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్

తెలంగాణ విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. వైఎస్సార్ హయాంలో ఏ రోజు కూడా ఆర్టీసీ చార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, విద్యుత్ చార్జీలు కానీ పెరిగింది లేదని ఆమె తెలిపారు. కానీ బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవని విమర్శించారు. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచి, నేడు కరెంటు చార్జీల భారం మోపారని మండిపడ్డారు. 50 యూనిట్ల లోపు వాడుకునే 40 లక్షల పేదలను కూడా వదలకుండా ముక్కు పిండి వసూలు చేస్తున్నాడని ఆరోపించారు.

ఏడాదికి రూ.6,800 కోట్ల లోటును పూడ్చుకునేందుకు సామాన్యుడిపై కరెంట్ భారాన్ని మోపాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూకుడు ఖర్చులకు, దొర పోకడలకు తెచ్చిన అప్పుల మీద వడ్డీకి వడ్డీ ప్రజల నుంచే వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనానికి కరెంటు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ కు ఎన్నికల్లో ఓటమి షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉండాలని షర్మిల పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement