Tuesday, July 23, 2024

గాఢ రస భక్తి గ్రంథం ఉగ్రం… వీరం

అఖండ భక్తి చైతన్యాన్ని పెంపొందించే దివ్య గ్రంథం ‘ఉగ్రం.. వీరం’. ఈ గ్రంథాన్ని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ అందించారు. రాజకీయాలకతీతం గా అన్ని పార్టీల ప్రముఖులకూ సైతం ఈ పురాణపండ నృసింహుణ్ణి అందించాలనే పొన్నాల లక్ష్మయ్య మహా సంకల్పాన్ని చేపట్టారు. ఈ మహూజ్వల మంత్ర వైభవాన్ని యాదాద్రిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసి ఆర్‌ ఆవిష్కరించనున్నారు.
తిరుమల… అహోబిలం నుండి యాదాద్రి వరకూ విస్తరించిన శ్రీ వేం కటేశ్వర, నారసింహ శ్రీ వైష్ణవ సంబం ధితమైన సుమారు వెయ్యి ఆలయాల కు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పొ న్నాల లక్ష్మయ్య ఈ శ్రీలక్ష్మీ నారసింహ స్వామి మంత్ర పేటికను ఉచితంగా సమర్పించనున్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరికీ, తెలు గు రాష్ట్రాలలో ఇరవై ఐదు పీఠాలకు, పన్నెండు మఠాలకు, మూ డు వందల ధార్మిక మండళ్లకు, సుమారు వంద పత్రి కల, ఛానెళ్ల, సోషల్‌ మీడియా ప్రతినిధులకు, రెం డు రాష్ట్రాల న్యాయమూర్తులకు, న్యాయవాదుల కు పొన్నాల లక్ష్మయ్య ఈ చక్కని ఉత్తమ గ్రంథా న్ని ఉచితంగా అందించనున్నారు.
విఖ్యాత ఆధ్యాత్మిక పారమార్ధిక ప్రచు రణల సంస్థ ‘జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం ‘ఈ దివ్య మంత్ర గుచ్చాన్ని మనో#హరంగా నాణ్యతా ప్రమాణాలతో ముద్రించడం పాఠకుల్ని మనస్సుకు హత్తుకునేలా ఉందని తిరు మల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, విఖ్యాత సంస్కృత ప్రవచనకర్త ఆకెళ్ళ విభీషణ శర్మ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement