Friday, April 26, 2024

భూమి కోసం ఎమ్మార్వో కాళ్లపై పడిన మహిళ

జీవనాదారంగా వ్యవసాయం చేసుకుంటున్న తమ భూమిని లాక్కొవద్దని మల్లమ్మ అనే ఓ మహిళా రైతు ఎమ్మార్వో కాళ్లపై పడి ప్రదేయ పడిన హృదయ విధారక ఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో చోటుచేసుకుంది. తన కుమారుడైన కుమారస్వామికి చెందిన 2.20 ఎకరాల భూమి 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూమిని తీసుకుని తమ పొట్ట కొట్టద్దంటూ ఆ వృద్దురాలు పర్వతగిరి ఎమ్మార్వో మహబూబ్ అలీ కాళ్లపై పడింది. అయితే ఇటీవలే రూర్బన్ ప్రాజెక్ట్ కింద పర్వతగిరి పట్టణంలో అసైండ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా ఆ భూమిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మార్వో కాళ్లపై పడి తమ జీనానదారమైన భూమిని లక్కోవద్దని బాధితులు కన్నీటి పర్యాంతమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement