Friday, March 29, 2024

కంటి రెప్పే కాటేసింది.. కుమార్తెపై అత్యాచారం చేసిన కన్నతండ్రి

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో దారుణం జరిగింది. 15 ఏళ్ల కుమార్తెపై కన్నతండ్రే పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కుమార్తెను చెరబట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా నివాసం ఉంటున్నాడు. జనవరి నెలలో బాలిక తల్లి సరకుల తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అప్పటి నుంచి పలుదఫాలుగా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటికి చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ బెదిరించేవాడు. తరచూ బాలికను కొడుతుండటంతో సుమారు 20 రోజుల కిందట 100 నంబరుకు ఫోన్‌ చేసింది. పోలీసులు వెళ్లి మందలించారు. ఆ తరువాత బాలిక.. అవ్వ, తాతల ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: తోప్ టీవీ యాప్ నిర్వాహకుడి అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement