Friday, April 19, 2024

డిసెంబర్ లో పట్టాలెక్కనున్న ధనుష్ ,కమ్ముల మూవీ!

తమిళ స్టార్ హీరో ధనుష్ తో టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే నటుడిగా ఇండియా వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ కు ఒక్క తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ తెరకెక్కబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభించాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. ఇక ఈ సినిమాను నారాయణ దాస్ నారంగ్, పుస్కూరు రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement