Saturday, April 27, 2024

తల్లీబిడ్డలను అక్కున చేర్చుకున్న సఖి

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గత రాత్రి నుండి ఒంటరిగా తల్లి బిడ్డలు ధీన స్థితిలో ఉండగా అది గమనించిన స్థానికులు సఖి నిర్వాహకులకు సమాచారం అందించారు.వెంటనే సఖి సిబ్బంది అక్కడికి వెళ్లి బాధితురాలి సమస్య తెలుసుకోని వెంటనే సఖి సెంటర్ కి తీసుకువచ్చి, బాధితురాలి సమస్య విన్న తరువాత బాధితురాలికి తోడుగా సఖి కేంద్రం ఉంటుందని ఆ బాధితురాలికి మనోదైర్యంన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ క్యాతం గాయత్రీ, కేస్ వర్కర్ పోత మాధవి, అకౌంటెంట్ కౌటం కృష్ణ, ఐటీ గోపు తిరుపతి సఖి టీం పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement