Thursday, May 16, 2024

పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ

భూపాలపల్లి : పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ సురేందర్‌ రెడ్డి పాల్గొనగా, అదనపు ఎస్పీ శ్రీనివాసులు జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌ నుండి ప్రారంభం అయిన సైకిల్‌ ర్యాలీ అంబేద్కర్‌ సెంటర్‌ మీదుగా హనుమాన్‌ -టె-ంపుల్‌ వరకు వెళ్లి, అక్కడి నుండి జయశంకర్‌ స్టాచు మీదుగా 5 ఇం-్లకె-న్‌ క్రాస్‌ నుండి మళ్లీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌ దగ్గర ముగిసింది. ఈ సైకిల్‌ ర్యాలీలో భూపాలపల్లి డీఎస్పీ రాములు, సీఐ రాజిరెడ్డి, ఎస్సై లు, పోలీస్‌ సిబ్బంది, యువత, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement