Thursday, May 2, 2024

Cancer Awareness : ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించాలి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌


ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే తొందరగా నయం చేయవచ్చని, క్యాన్సర్‌ బాధితుల్లో మనస్థైర్యాన్ని పెంపొందిచాల్సిన అవసరం ఉందని టీ-ఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. మంగళవారం ప్రపంచ రొమ్ము క్యాన్సన్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వస్తవ క్యాన్సర్‌ కేర్‌, రోటరీ డిస్ట్రిక్ట్‌-3150, హార్ట్‌రాక్‌ కేర్‌ సంయుక్త ఆధ్వర్యంలో దోమలగూడలోని ఏవీ కళాశాల విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు అవగాహన నడకను ఆయన జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ వచ్చిందని తెలియగానే చాలా మంది మానసికంగా కృంగిపోతున్నారని, అలాంటి వారికి తోడుగా నిలువాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్‌పై టీఎ-స్‌ ఆర్టీసీ సంస్థ తరఫున రోటరీ క్లబ్‌, స్వస్తవ క్యాన్సర్‌ కేర్‌ సంస్థలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్‌లు, బస్టాప్‌లు, డిపోలలో హోర్డింగ్‌లు, ప్లెక్సీలు ఏర్పాటు- చేసి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement