Saturday, April 27, 2024

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. మీరు వెళ్లాల్సిన రూట్ ఇదీ..

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి జంక్షన్‌ కు సైబర్‌ టవర్స్‌ మీదుగా వెళ్లేవారు అయ్యప్ప సొసైటీ సీవోడీ జంక్షన్‌, దుర్గం చెరువు నుంచి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. ఇక, కొండాపూర్‌, ఆర్‌సీపురం, చందానగర్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీనితో పాటు హఫీజ్‌పేట, మియాపూర్‌, కొత్తగూడ నుంచి సైబర్‌ టవర్స్‌ మీదుగా జూబ్లీహిల్స్‌ వైపు వెళ్లే వారు రోలింగ్‌ హిల్స్, ఐకియా, ఇనార్బిట్‌ మాల్‌ నుంచి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: 5వ రోజు షర్మిల పాదయాత్ర.. నేటి షెడ్యూల్ ఇది

Advertisement

తాజా వార్తలు

Advertisement