Saturday, May 4, 2024

గంజాయిపై ఉక్కు పాదం.. ఇద్దరు అరెస్ట్

గంజాయి సాగుపై జగిత్యాల పోలీసులు ఉక్కు పాదం మోపారు. జిల్లా ఎస్పి సింధు శర్మ ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై దృష్టిసారించారు. జగిత్యాల బీట్ బజార్ కు చెందిన అరుముళ్ల సాయికుమార్, ఆసిఫాబాద్ లింగాపూర్ గ్రామానికి చెందిన చందు గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారని సమాచారం మేరకు దాడులు నిర్వహించి గంజాయి ముక్కలతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల డిఎస్పి ప్రకాష్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Huzurabad by poll: ప్రచారంలో ఈటల దూకుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement