Monday, May 20, 2024

TS | కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ రేవంత్‌ లను సాగనంపుదాం : కేటీఆర్

అడ్డగుట్ట (ప్రభ న్యూస్) : 40 ఏళ్ల ప్రజా సేవలో ఓటుమెరుగని పద్మారావు చిచ్చను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్‌‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా (శుక్రవారం) సికింద్రాబాద్ అడ్డగుట్ట రియో పాయింట్ వద్ద జరిగిన రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రచార రథంపై అడ్డగుట్టకు చేరుకున్న కేటీఆర్, పద్మారావులకు… సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి అక్కడికి భారీగా చేరుకున్న నేతలు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలలు బోనం కుండలు, బతుకమ్మ లతో గ్రాండ్గా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ… దేశంలో మోడీ, రాష్ట్రంలో కేడి వీళ్లిద్దరిని ఇంటికి తరిమేయాలని మోడీ, రేవంత్ రెడ్డి లపై ఘాటుగా స్పందించారు. ఈ మధ్యనే జరిగిన ముఖ్యమంత్రి ఎన్నికల్లో రాష్ట్ర గ్రామీణ ప్రజలు దొంగ హామీలను నమ్మి కేసీఆర్ పాలనను దూరం చేసుకున్న కూడా హైదరాబాద్ ప్రజలు భారీ విజయాన్ని అందించారని కొనియాడారు.

100 రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం కేడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు ఆగస్టు తర్వాత అంటూ మరో అబద్ధపు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. అదేవిధంగా కేంద్రంలో రెండుసార్లు అధికారం చేపట్టిన బీజేపి మోడీ ప్రభుత్వం నెలకోసారి పెట్రోల్, డీజిల్, ధరలను పెంచుతూ ప్రజలపై పన్నుల బారంతో మోయలేని భారం వేస్తున్నారని దుయ్యబడ్డారు.

గెలిచిన కొత్తలో నరేంద్ర మోడీ ఇంటింటికి నీళ్ళు ఇస్తా, రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తాం, అని అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలకు వెన్ను చూపించారని అన్నారు.కెసిఆర్ పాలనలో దేశంలోనే అభివృద్ధి రాష్ట్రంగా ప్రసిద్ధి గాంచిన తెలంగాణపై బీజేపీ వివక్ష వైఖరితో ఒక్కటంటే ఒక్కటి విద్యాలయాన్ని ఇయ్యకుండా చేతులు దులుపుకున్నారని అన్నారు.అదేవిధంగా సికింద్రాబాద్ ప్రస్తుత ఎంపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి,సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు.సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పద్మారావును లక్ష ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement