Sunday, April 28, 2024

5వ రోజు షర్మిల పాదయాత్ర.. నేటి షెడ్యూల్ ఇది

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్ధానం పాదయాత్ర 5వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం అయింది. కొత్తతండ, డబ్లీగూడ, మన్సాన్‎పల్లి, కొత్వాల్ చెరువు తండా మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు మహేశ్వరం సభలో షర్మిల ప్రసంగించనుంది.

ఇక, శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గొల్లపల్లిలో మొదలై మహేశ్వరం మండలం నాగరం వరకు సాగింది. మొత్తం 14 కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర చేశారు.

ఇది కూడా చదవండి: Suspence: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ నేడే.. టీ20లో అసలైన పోరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement