Saturday, May 11, 2024

TS : రేవంత్‌కు కుర్చీ క‌దులుతంద‌ని భ‌యం ప‌ట్టుకుంది…కిష‌న్‌రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి కుర్చీ కదులుతుందని భయంతోనే బీజేపీపై రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు.

- Advertisement -

రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో లేదని.. తమ అజెండాలో లేని అంశాలపై సీఎం రేవంత్ చేస్తోన్న మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కేసీఆర్‌పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పట్టం గట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement