Friday, April 26, 2024

బ్యాట్ పట్టిన స్పీకర్.. గల్లీ క్రికెట్ ఆడిన పోచారం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సరదాగా క్రికెట్ ఆడారు. బుధవారం తన స్వగ్రామం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామం వెళ్లి వస్తున్న స్పీకర్‌కి మార్గమధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించగానే కారు దిగి ఇలా బ్యాటు అందుకున్నారు. పిల్లలు బాల్ విసరగా షాట్లు కొట్టి స్పీకర్ అలరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement