Thursday, May 16, 2024

ప్లాన్‌తోనే ఈ మోసాలకు పాల్పడ్డారా?: కార్వీ చైర్మన్ పై ప్రశ్నల వర్షం

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్  ఛైర్మన్ పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్థసారథిని.. నాంపల్లిలోని సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. నేడు, రేపు పార్థసారథిని ప్రశ్నించనున్నారు.

ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసినందుకు పార్థసారథిపై సీసీఎస్​లో కేసు నమోదైంది. ఈ నెల 19న అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఇండస్ ఇండ్ బ్యాంకులో రూ.137 కోట్ల రుణం తీసుకున్న పార్థసారథి… ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. నిబంధనలకు విరుద్దంగా పెట్టుబడిదారుల షేర్లను తనఖా పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు నాంపల్లి న్యాయస్థానం ఆదేశాలతో రెండు రోజుల పాటు పార్థసారథిని ప్రశ్నించనున్నారు. 

చంచల్‌గూడ జైలులో పార్థసారథి రిమాండ్‌ ఖైదీగా ఉండగా.. విచారణ కోసం రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎక్కడకు మళ్లించారు?.. ముందస్తు ప్లాన్‌తోనే ఈ మోసాలకు పాల్పడ్డారా? అనే సమాచారాన్ని పోలీసులు వెలుగులోకి తేనున్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్‌ కూడా జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీసీఎస్‌లో నమోదైన కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు(ఈడీ)కి సీసీఎస్‌ పోలీసులు అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement