Wednesday, May 8, 2024

Followup : ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీలో ర్యాగింగ్‌ కలకలం.. 20 మంది విద్యార్థులపై సస్పెన్షన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోనూ ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. జూనియర్లను తన గదిలోకి పిలిపించి వికృత చేష్టలకు దిగడంతో సీనియర్లపై వారు ర్యాగింగ్‌ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన వర్సిటీ అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడిన ఇరవై మంది సీనియర్‌ విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

వర్సిటీ గృహంలో జూనియర్లను తమ గదికి పిలిపించి సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడ్డారని దీంతో 13 మంది విద్యార్థులను హాస్టల్‌ నుంచి ఏడాది పాటు ఏడు మంది విద్యార్థులను ఒక సెమిస్టర్‌ పాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement