Sunday, May 19, 2024

ఆగస్టు నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు..

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10 వ తేది వరకు జరగనున్న పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది. మొత్తం 600 టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేస్తారు. రూ.2500 చెల్లించి భక్తులు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు స్నపన తిరుమంజనంలో, చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు.

పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్ర ధారణలో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 వద్దకు చేరుకోవాలి. టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజనల్‌ ఫోటో గుర్తింపు కార్డు చూపాలి. మరిన్ని విరాలకు టిటిడి వెబ్‌సైట్లను సంప్రదించగలరు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement