Monday, May 20, 2024

TS : మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాజీ సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న

మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ మెద‌క్, సంగారెడ్డి జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. నర్సాపూర్, పటాన్ చెరులలో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో విమర్శల జోరును కూడా పెంచారు.

- Advertisement -

బీఆర్ఎస్ కు ఓటేస్తే తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో గళం విప్పి సాధించుకుంటామని ఆయన చెబుతూ ముందుకు సాగుతున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలుపర్చడం లేదని ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement