Wednesday, July 24, 2024

TS | రేపు ఖమ్మంలో కేటీఆర్‌ పర్యటన…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నేడు భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం ఇల్లందు నియోజకవర్గంలోని జేకే గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నాం కొత్తగూడెంలో, సాయంత్రం ఖమ్మం టౌన్‌లోని ఎస్‌బీఐటీ కాలేజీలో ఓటర్ల సమావేశంలో పాల్గొనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి వరంగల్‌, నల్గొండ జిల్లాలకు సమన్వయ కర్తలను నియమించారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌లతో పాటు పలువురు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించారు. నియోజకర్గ ఇంఛార్జ్‌లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలతో పాటు సమన్వయ కర్తలు ఆయా నియోజవర్గాల్లో పని చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement