Sunday, May 19, 2024

TS : ఆర్మూర్‌, నిజామాబాద్​లలో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌

ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి ఆర్మూర్‌, నిజామాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థుల గెలుపు కోసం ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు కాంగ్రెస్ శ్రేణులో సీఎం ప‌ర్య‌ట‌న‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్‌, బీజేపీల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ప్ర‌చారంలో దూసుక‌పోతున్నారు.

- Advertisement -

అయితే, ఇవాళ‌ సాయంత్రం ఆర్మూర్ లో జరిగే రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. అక్క‌డి నుంచి రాత్రి నిజామాబాద్‌కు చేరుకొని అక్క‌డ రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement