Sunday, May 19, 2024

AP : ఇవాళ మ‌రోసారి ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మరోసారి ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు.హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతికి చేరుకుంటారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అనంతరం తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేటకి వెళ్లనున్నారు మోదీ.

రాజంపేట లోక్‌సభ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకుంటారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement