Sunday, May 19, 2024

TS : బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ ద్రిగ్భాంతి

బాచుప‌ల్లిలో నిన్న రాత్రి గోడ కూలీ ఏడుగు మృతి చెందిన విష‌యం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ద్రిగ్భాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

- Advertisement -

కుండపోత వర్షం పడడం తో ఒక్కసారిగా గోడ కూలినట్లు అధికారులు తెలిపారు. భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడుగురు మంది మృతి, మరో నలుగురికి గాయాలైనట్లు సీఎం రేవంత్‌రెడ్డికి వివ‌రాల‌ను అందించారు. చనిపోయిన వారు ఒరిస్సా, చ‌త్తీష్‌ఘ‌డ్‌ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాబు, ఒక మహిళ, న‌లుగురు పురుషులు ఉన్నార‌ని తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement