Thursday, May 2, 2024

పంచాయతీ సమావేశంలో పలు తీర్మాణాలు..

ఘట్‌కేసర్‌ : మండలంలోని కొర్రెముల గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన పంచాయతీ సాధారణ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు తీర్మాణాలు చేశారు. సర్పంచ్‌ ఓరుగంటి వెంకటేష్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామంలో కృష్ణా నీటి సరఫరాకై పైప్‌లైన్‌ వేయుట, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌లో మోటీరియల్‌ కొనుగోలు చేయుట మరియు గ్రామంలో శానిటేషన్‌ నిర్వహించడానికి టాటా ఏసీ ఆటోను కొనుగోలు చేయడానికి తీర్మాణాలు చేయడం జరిగిందిని పంచాయతీ సెక్రటరీ కవిత తెలిపారు. ఈసమావేశంలో ఉప సర్పంచ్‌ కందుల రాజు, ఎంపిటీసీ బొడ్డు వినోద, వార్డు సభ్యులు దయ్యాల ఆంజనేయులు, కోళ్ల ఈశ్వరి, ఎరుకల దుర్గ రాజు, ఉడుగుల సునీత, గుమ్మడివెల్లి భాస్కర్‌, పర్నాటి బాబు, జువ్వ స్వామి, మాటూరి సుష్మ, గొబ్బిరి లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement