Thursday, April 25, 2024

టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయ భ‌వ‌న నిర్మాణాల‌ను ప‌రిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

కరోనా వల్ల నిర్మాణపు పనులు ఆలస్యం
త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తాం
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ – జనగామ జిల్లాలో నిర్మిస్తున్న టిఆర్ఎస్ పార్టీ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం నిర్మాణంలో వున్న జనగామ జిల్లా టి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా చేసిన మంత్రి పలు సూచనలు చేశారు.కొద్ది రోజుల్లో టి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం అని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కెటీఆర్ ల చేతుల మీదుగా ప్రారంభింప అని తెలిపారు.కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమైంది అని, అతి త్వరలో కార్యాలయాన్ని పూర్తి చేసి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులోకి తెస్తాం అని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది అని, ప్రజలు జాగ్రత్తగా వుండాలి అని, మాస్కులు ధరిస్తూ,భౌతిక దూరం పాటిస్తూ,తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారిని అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement