Tuesday, April 23, 2024

తెరాస నాయకులకు ఎమ్మెల్యే అరూరి దిశానిర్దేశం

హసన్ పర్తి, : రాబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో గులాబీ జెండా ఎగురావేయాలని పార్టీ నాయకులకు ఎమ్మెల్యే అరూరి పిలుపునిచ్చారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హాసన్ పర్తి ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులతో హంటర్ రోడ్డు లోని అలకనంద గార్డెన్స్ లో అరూరి రమేష్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో టీఆరెఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. టీఆరెఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు అందుతున్నాయని, వాటిని ప్రజలకు వివరించి టీఆరెఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా చూడాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆరెఎస్ ప్రభుత్వాన్ని భారీ మెజర్టీ తో గెలిపించుకోవాల్సిన భాద్యత మనపై ఉన్నదని గుర్తుచేశారు. కనుక ప్రతీ ఒక్కరూ శక్తి వంచన లేకుండా టీఆరెఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ రావు, మండల వ్యవసాయ రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ అంచూరి విజయ్ కుమార్, తెరాస నాయకులు కందుకూరి చంద్రమోహన్, పాపిశెట్టి శ్రీధర్, మండల అధ్యక్షులు బండి రజిని కుమార్, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement