Thursday, May 16, 2024

బాక్సింగ్ పోటీ విజేత‌ల‌కు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అభినంద‌న‌లు..

కుత్బుల్లాపూర్, క్రీడల్లో నైపుణ్యం సాధిస్తున్న క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. హర్యానా రాష్ట్రంలో గత నెల 25, 26, 27, 28న బాబారామ్ రూప్ బాక్సింగ్ అకాడమీ భవాని కేర్ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ హర్యానాలో నిర్వహించిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2021 పోటీల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గౌడ్ ను మంగళవారం తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వివేక్ క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీల్లో వి.నావూష్, మల్లికార్జున్, మణిరత్నంలు గోల్డ్ మెడల్స్ సాధించగా , వి.లితర్షన, సరిన దర్జీ, పుష్పెందర్ లు సిల్వర్ మెడల్స్ సాధించారు. సాయికుమార్, రవి శంకర్, రోహన్ అభిరామ్, శివ శంకర్, భువనేశ్వర్, శివప్రసాద్, రజనీష్ లు మెడల్స్ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ లు జి.రవి, కమల్, సునీత, స్టార్ రాజు, వినోద్ కుమార్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement