Saturday, May 4, 2024

ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి మ‌ల్లారెడ్డి

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఆరోగ్య శాఖ తరపున ఆశా వర్కర్స్ కు స్మార్ట్ మొబైల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఈరోజు జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లిస్తున్న ఘనత సీఎం కేసీఅర్ కే దక్కుతుందని మంతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కావ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement