Saturday, May 18, 2024

AP | ఎన్నికల విధుల్లో ఉద్యోగులకు ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవు..

అమరావతి, ఆంధ్రప్రభ : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిఓఆర్టి నెంబర్‌ 845, తే.04.05.2024 ను జారీ చేశారు.

ఓటర్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు ఒకరోజు ప్రత్యేక క్యాజువల్‌ సెలవును మంజూరు చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. సెక్రటేరియట్‌ విభాగాలు, విభాగాల అధిపతి, జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement