Thursday, May 2, 2024

కౌన్సిలర్ జంగా హరికృష్ణ యాదవ్ రాజీనామా…

మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయ‌న రాజీనామా చేసి వారం రోజులు గ‌డ‌వ‌క‌ ముందే మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు కౌన్సిలర్ జంగా హరికృష్ణ యాదవ్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామా పత్రాన్ని మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ కు అందజేసినట్లు సమాచారం. రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement