Monday, May 6, 2024

క‌రీంన‌గ‌ర్ లో బండి సంజ‌య్ ఇంటి వ‌ద్దే నిర‌స‌న దీక్ష

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కుమార్ కరీంనగర్ లోని తన నివాసంలోనే నిర‌స‌న దీక్ష‌ ప్రారంభించారు. కేసీఆర్ సర్కార్ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు ప్రారంభమ‌య్యాయి. కరీంనగర్ లోని నిరసన దీక్షలో బండి సంజయ్ తోపాటు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, పాదయాత్ర సహ ప్రముఖ్ జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమదేవి, జె.సంగప్ప, దరువు ఎల్లన్న, తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ నిరసన దీక్ష కొనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement