Saturday, April 27, 2024

కాన్వాయ్ ఆపి… విద్యార్థుల ర్యాలీలో మంత్రి సబితారెడ్డి…

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా కాన్వాయ్ అపి విద్యార్థుల ర్యాలీలో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఉత్సహాన్ని నింపారు. బంజారాహిల్స్ లోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాల విద్యార్థులు తాజ్ కృష్ణ ముందు నుండి ర్యాలీ కొనసాగుతుంది. అదే దారిలో టీ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ప్రారంభించటానికి వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల ర్యాలీని చూసి కాన్వాయ్ అపి కారు దిగి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండా చేత పట్టుకొని తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలతో మంత్రితో కలిసి కదం తొక్కారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా 15 రోజుల కార్యక్రమాల్లో భాగంగా శనివారం విద్యార్థుల, ఎన్ సీ సీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్, గైడ్స్ , ఉద్యోగుల జెండా ర్యాలీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement