Saturday, April 27, 2024

ముగ్గురికి కరోనా పాజిటివ్

యాచారం : యాచారం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో 24మందికి కరోనా ర్యాపిడ్‌ టెస్టులు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇక నుండి అయిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా సెకండ్‌ వెవ్ ప్రారంభం అయ్యిందని చాలా రోజుల తర్వాత యాచారం మండలంలో తిరిగి పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం వల్ల ప్రజలలో కొంత భయాందోళన వాతావరణం కనిపిస్తుంది. ఆరోగ్య విషయం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మాస్కులను తప్పని సరిగా ధరించాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అనుమానం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా టెస్టులు చేయించుకోవాలని డాక్టర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement