Thursday, May 16, 2024

నేడు యాదాద్రిలో శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూడోరోజు సంప్రోక్షణలో భాగంగా అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం యాగశాలలో శాంతి పాఠంతో కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయి. అనంతరం ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనము, షోడష కలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి కొనసాగనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి.. సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, ద్వారాతోరణ ధ్వజకుంభ ఆరాధన, మూల మంత్రి హవనములు, పంచగవ్యాధి వాసం, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement