Wednesday, May 8, 2024

రోడ్లపై గుంతలు… పట్టించుకోని అధికారులు

బీర్కూర్, జులై 12 ప్రభ న్యూస్: బీర్కూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో రహదారిపై గుంతలు పడి ప్రమాదాలకు దారితీస్తుంది. గత కొన్ని రోజులుగా అర్ అండ్ బీ అధికారులు, గ్రామస్థాయి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. దీంతో గ్రామానికి చెందిన యార్లగడ్డ రమణ గుంతలను పుడుస్తుండగా గమనించిన గ్రామానికి చెందిన మరికొంత మంది యువకులు గుంతలను పూడ్చారు. దీంతో వాహనదారులు, గ్రామస్తులు యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ పటేల్, మారుతి పటేల్, ధర్మతేజ,అజీమ్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement