Wednesday, May 8, 2024

ప్రేమ పెళ్లి.. మరుసటిరోజే గొడవలు.. మనస్థాపంతో భార్య ఆత్మహత్య..

మెదక్‌ : మనోహరాబాద్‌ మండలం ధర్మరాజుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గత నవంబర్ 7న ప్రేమ పెళ్లి చేసుకొని మరుసటిరోజే భార్య తేజశ్రీని భర్త యశ్వంత్‌ రెడ్డి వదిలేశాడు. దీంతో భర్తపై నవంబర్‌ 8న తేజశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో మనస్థాపంతో డిసెంబర్‌ 18న తేజశ్రీ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గతంలోనూ తేజశ్రీ రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. తేజశ్రీ మృతికి భర్త యశ్వంత్‌ రెడ్డినే కారణమని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement