Saturday, April 27, 2024

మునుగోడు ఎన్నిక‌ల్లో గెలిచేది బీజేపీనే : ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు అన్నారు. ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ర‌ఘునంద‌న్ రావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం (MIM) అనుమతితో సెప్టెంబర్ 17 వేడుకలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసింది సెక్యూలరిజమా? మతతత్వమా? సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.వంద కోట్లు ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల్లో గెలిచేది బీజేపీయేనని విశ్వాసం వ్యక్తం చేశారు. మునుగోడు, వేములవాడ ఉప ఎన్నికలతో మరో ఆర్ఆర్ (RR)లు బీజేపీ ఖాతాలో జమవుతాయన్నారు. వేములవాడ ఉప ఎన్నిక తీర్పు వెంటనే ఇవ్వాలని రాజన్నను కోరినట్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement