Thursday, April 25, 2024

న‌ల్గొండ‌.. వైద్యుల నిర్ల‌క్ష్యానికి బాలింత మృతి

వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా బాలింత మృతిచెందిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని న‌ల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. న‌ల్గొండ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. డెలివ‌రీ స‌మ‌యంలో సాధార‌ణ ప్ర‌స‌వం కోసం డాక్ట‌ర్లు కాల‌యాప‌న చేశారు. దీంతో ప్ర‌స‌వం త‌ర్వాత తీవ్ర ర‌క్త‌స్రావంతో బాలింత కోమాలోకి వెళ్లిపోయింది. గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ బాలింత అఖిల చ‌నిపోయింది. దీంతో న‌ల్గొండ ఆస్ప‌త్రి ముందు అఖిల మృత‌దేహంతో బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యంపై ఎంపీ కోమ‌టిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల మీద ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం స‌డ‌లుతోంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement