Thursday, May 2, 2024

కేసీఆర్ చిత్రపటానికి ఆదివాసీల పాలాభిషేకం

ఆదివాసీల కోసం హైదరాబాద్ నడిబొడ్డున 60 కోట్లతో కుమ్రంభీమ్, సేవలాల్ భవనాలను ప్రారంభించడంతో పాటు నిరుపేద గిరిజనుల కుటుంబాలకు గిరిజన బంధు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆదివాసీలు పాలాభిషేకం నిర్వహించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రిలో పాలాభిషేకం నిర్వహించిన అనంతరం కేసీఆర్ కు జయహో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ గిరిజనలకు వారం రోజుల్లో 10% రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయక్ పోడ్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement