Sunday, May 12, 2024

ఎన్ని కుట్రలు చేసినా వ్యక్తిత్వాన్ని తుల తూగ లేరు..

గుమ్మడిదల : గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామ పంచాయితీలో ఉపసర్పంచ్‌ పలుగు గోవర్ధన్‌ రెడ్డిపై పాలకవర్గం సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని చేయడం జరిగింది. ఆర్డిఓ నగేష్‌ డిఎల్పిఓ సతీష్‌రెడ్డి ల ఆద్వర్యంలో కానుకుంట గ్రామ పంచాయితీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో 12 మంది సభ్యులకు గాను ఎనిమిది మంది వార్డు సభ్యులు ఉపసర్పంచ్‌ గోవర్ధన్‌రెడ్డి ఘనంగా సన్మానించి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఉపసర్పంచ్‌ పలుగు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వార్డు సభ్యులు తనపై ఉంచుకున్న నమ్మకాన్ని కొంతమంది వ్యక్తులు తప్పుదోవ పట్టించి తనపై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని నిజ నిజాలను తెలుసుకొని తనకు మద్దతు తెలిపినందుకు వార్డు సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ముందు కూడా మరింత ఉత్సహాంతో పని చేసే అందరి మెప్పును పొందుతానని ఆయన హమీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నీలమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఎంపిఓ దయాకర్‌రావు, పాలకవర్గం సభ్యులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement