Monday, May 13, 2024

మౌలిక వసతుల కల్పనకు కృషి..

గుమ్మడిదల : మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని జెడ్పీటీసీ కుమార్‌గౌడ్‌ అన్నారు. గుమ్మడిదల మండల కేంద్రంలో సీసీ రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు స్థానిక సర్పంచ్‌ నరసింహారెడ్డి ఆద్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 35 లక్షల రూపాయలతో గ్రామ పంచాయితీ నిధులతో ఈ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో అన్ని ప్రాంతాల అభివృద్దికి చిత్తశుద్దితో పాటుపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి దేవేందర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ మొగులయ్య, ఎంపిటీసీ పద్మ, వార్డు సభ్యులు రవీందర్‌రెడ్డి, ఆంజనేయులు, సత్యనారాయణఇ, జైపాల్‌రెడ్డి,రాము, భాస్కర్‌, మండల పార్టీ అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నల్తూర్‌ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement