Tuesday, July 23, 2024

AP : క‌ర్నూల్ జిల్లాలో ఓటు హ‌క్కు వినియోగించుకున్న ప్ర‌ముఖులు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. మాక్ పోలింగ్ ప్రక్రియ అనంతరం ఉదయం 7 గంటలకు అన్నిచోట్ల పోలింగ్ మొదలైంది. కాగా కర్నూల్ తో పాటు ఓర్వకల్లు, అవుకు పలుచోట్ల కొన్ని పోలింగ్ బూత్ కేంద్రాలలో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి.

- Advertisement -

వాటిని తిరిగి పునరుద్దించిన అనంతరం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది. నంద్యాలలోనీ గాంధీనగర్ హిందూ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకోగా, ఇక ఇదే కేంద్రంలో హిజ్రాలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. కర్నూల్ నగరంలోని కింగ్ మార్కెట్ సమీపంలో పోలింగ్ బూత్ కేంద్రమును జిల్లా కలెక్టర్ సృజన సందర్శించారు. అక్కడ పోలింగ్ తీరును పరిశీలించారు. మంత్రాలయంలో నీ మాధవరంలో టిడిపి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement