Thursday, July 25, 2024

TS : మెదక్ జిల్లాలో పిడుగుప‌డి… తండ్రికొడుకులు మృతి

మెదక్ జిల్లాలో విషాదం నెల‌కొంది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పెద్ద శంకరంపేట (మం) రామోజీపల్లి వాసులుగా గుర్తించారు పోలీసులు.

అయితే.. ధాన్యం ఆరబెట్టడానికి కొడుకుని తీసుకువచ్చాడు తండ్రి.. ఈ క్రమంలోనే.. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో చెట్టు కిందకి వెళ్లారు తండ్రికొడుకులు. దీంతో.. ఒక్కసారిగా.. వీళ్లు ఉన్న చెట్టుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే తండ్రీకొడుకులు రాములు(46)విశాల్(14) మృతి చెందారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement